Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 AM

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా ... నిధులు మంజూరు చేయిస్తా... పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి...

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా ... నిధులు మంజూరు చేయిస్తా... పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి...

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా ... నిధులు మంజూరు చేయిస్తా... పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి...
February 23, 2026 08:14 PM 195 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ మున్సిపాలిటీ ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాలి....

సమన్వయంతో సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలి....

కోదాడ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ పదవులకు వన్నె తేవాలి.... కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్....

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం కోదాడ మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని, చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు కలిసికట్టుగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు.సోమవారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గా కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ గా దేవరపల్లి మల్లేశ్వరి లు పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారిని అభినందించి మాట్లాడారు. పాలకవర్గ సభ్యుల సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పట్టణాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా కోదాడలో నిలపాలి అన్నారు. ఆదర్శవంతంగా పనిచేసి కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ పదవులకు వన్నె తేవాలన్నారు. పట్టణ అభివృద్ధిలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తేవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు , అధికారులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News