ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా ... నిధులు మంజూరు చేయిస్తా... పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి...
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా ... నిధులు మంజూరు చేయిస్తా... పట్టణాన్ని అభివృద్ధి చేసుకోండి...
Harish HS
కోదాడ మున్సిపాలిటీ ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాలి....
సమన్వయంతో సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలి....
కోదాడ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ పదవులకు వన్నె తేవాలి.... కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్....
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం కోదాడ మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని, చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు కలిసికట్టుగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు.సోమవారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ గా కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ గా దేవరపల్లి మల్లేశ్వరి లు పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారిని అభినందించి మాట్లాడారు. పాలకవర్గ సభ్యుల సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. పట్టణాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా కోదాడలో నిలపాలి అన్నారు. ఆదర్శవంతంగా పనిచేసి కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ పదవులకు వన్నె తేవాలన్నారు. పట్టణ అభివృద్ధిలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తేవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు , అధికారులు ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి