హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్కు నియామక పత్రం
హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్కు నియామక పత్రం
Krishna
లంబాడి హక్కుల పోరాట సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కంగ్టి మండల పరిధిలోని రామ్సింగ్ తండాకు చెందిన సురేష్ సింగ్ను నియమించారు. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విస్లావత్ అశోక్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సురేష్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లంబాడి జాతి హక్కుల పరిరక్షణ, తండాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అలాగే ఈనెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే “నంగారా భేరి మహాధర్నా”ను విజయవంతం చేయాలని లంబాడి జాతి ప్రజలకు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి