Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:44 AM

హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్‌కు నియామక పత్రం

హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్‌కు నియామక పత్రం

హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్‌కు నియామక పత్రం
22-05-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

లంబాడి హక్కుల పోరాట సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కంగ్టి మండల పరిధిలోని రామ్‌సింగ్ తండాకు చెందిన సురేష్ సింగ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విస్లావత్ అశోక్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సురేష్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లంబాడి జాతి హక్కుల పరిరక్షణ, తండాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అలాగే ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే “నంగారా భేరి మహాధర్నా”ను విజయవంతం చేయాలని లంబాడి జాతి ప్రజలకు పిలుపునిచ్చారు.

Sthanikam

హైదరాబాద్ రాష్ట్ర స్థాయి సమావేశంలో సురేష్ సింగ్‌కు నియామక పత్రం

Article Image

లంబాడి హక్కుల పోరాట సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కంగ్టి మండల పరిధిలోని రామ్‌సింగ్ తండాకు చెందిన సురేష్ సింగ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విస్లావత్ అశోక్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు సురేష్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లంబాడి జాతి హక్కుల పరిరక్షణ, తండాల అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అలాగే ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే “నంగారా భేరి మహాధర్నా”ను విజయవంతం చేయాలని లంబాడి జాతి ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News