Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:51 PM

హుజూర్నగర్ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

హుజూర్నగర్ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

హుజూర్నగర్ పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక
February 17, 2026 06:25 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కార్యవర్గం ఎంపిక

హుజూర్నగర్ నియోజకవర్గ పారామెడికల్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ సంఘం అధ్యక్షుడిగా హుజూర్నగర్‌కు చెందిన గుండు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ల్యాబ్ యజమానులు, ల్యాబ్ సాంకేతిక నిపుణులు అనేక దశాబ్దాలుగా రాష్ట్ర స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు సమగ్ర సంఘం లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కేంద్రంగా “తెలంగాణ పారామెడికల్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ సంఘం” పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి. వీరయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు కిన్నెర రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్ల అజయ్ ఆధ్వర్యంలో హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి సంఘం అధ్యక్షుడిగా గుండు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కోల నవీన్, సంయుక్త కార్యదర్శిగా పి. నాగరాజు, ఖజాంచీగా డి. నరేందర్, కార్యవర్గ సభ్యులుగా కే. సాయి, షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అనంతరం ఎన్నికైన కార్యవర్గ సభ్యులను రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సన్మానించి అభినందించారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News