Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు
07-04-2026 314 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్పీ చేతుల మీదుగా అందజేత

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన హోంగార్డ్ సుర్వి వెంకటేశం కుటుంబానికి రూ.34 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళవారం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన ఈ బీమా సాయం కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించనుంది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వంతో పాటు బ్యాంకులు అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ టి. శ్రీనివాస్, క్లస్టర్ హెడ్ కొల్లు గోపీకృష్ణ, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు

Article Image

ఎస్పీ చేతుల మీదుగా అందజేత

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన హోంగార్డ్ సుర్వి వెంకటేశం కుటుంబానికి రూ.34 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళవారం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన ఈ బీమా సాయం కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించనుంది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వంతో పాటు బ్యాంకులు అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ టి. శ్రీనివాస్, క్లస్టర్ హెడ్ కొల్లు గోపీకృష్ణ, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News