PRINT TIME: May 26, 2026 04:54 PM
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు
April 07, 2026 08:58 PM
303 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
ఎస్పీ చేతుల మీదుగా అందజేత
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన హోంగార్డ్ సుర్వి వెంకటేశం కుటుంబానికి రూ.34 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళవారం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన ఈ బీమా సాయం కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించనుంది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వంతో పాటు బ్యాంకులు అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ టి. శ్రీనివాస్, క్లస్టర్ హెడ్ కొల్లు గోపీకృష్ణ, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి