Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ రాములు పర్యవేక్షణ చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 10:23 PM

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు

హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు
April 07, 2026 08:58 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్పీ చేతుల మీదుగా అందజేత

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన హోంగార్డ్ సుర్వి వెంకటేశం కుటుంబానికి రూ.34 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళవారం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన ఈ బీమా సాయం కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించనుంది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వంతో పాటు బ్యాంకులు అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ టి. శ్రీనివాస్, క్లస్టర్ హెడ్ కొల్లు గోపీకృష్ణ, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News