Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:53 PM

హిందూ విశ్వాసాల పట్ల జగన్‌కు చిన్నచూపు రంగేపల్లి వెంకటరమణ

హిందూ విశ్వాసాల పట్ల జగన్‌కు చిన్నచూపు రంగేపల్లి వెంకటరమణ

 హిందూ విశ్వాసాల పట్ల జగన్‌కు చిన్నచూపు రంగేపల్లి వెంకటరమణ
February 24, 2026 07:07 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో

హిందూమత విశ్వాసాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాల పట్ల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ ఆరోపించారు. సోమందేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి చిత్రాలతో రాజకీయ నినాదాలు చేయడం అనుచితమని పేర్కొన్నారు. టీటీడీ ఆస్తులు, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో లడ్డూల పంపిణీ, సేవా–దర్శన టిక్కెట్లలో అక్రమాలు, తలనీలాల వ్యవహారంలో లోపాలు చోటుచేసుకున్నాయని అన్నారు. రామ్మందిర్ అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంలోనూ వివాదాలు తలెత్తినట్లు పేర్కొన్నారు.

హిందూ దేవాలయాల పరిరక్షణలో వైఫల్యం స్పష్టమైందని విమర్శించారు.

ఈ సమావేశంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News