హెల్మెట్ ధరించని వాహనదారులపై వినూత్న ప్రయత్నం చేసిన చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ
హెల్మెట్ ధరించని వాహనదారులపై వినూత్న ప్రయత్నం చేసిన చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో ఎస్ఐ రామ కృష్ణ వారి సిబ్బంది తో కలిసి హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా బదులు హెల్మెట్ లు కొనుగోలు చేయించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లు వల్ల కలిగే ఉపయోగాలను గురించి అవగాహన కల్పించారు ఎస్ఐ డి రామకృష్ణ రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జరిమానా కాదు.ప్రాణ రక్షణే ముఖ్యం.సాధారణంగా హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించడం సహజం. అయితే చాట్రాయి ఎస్ఐ ఒక అడుగు ముందుకు వేసి, కేవలం జరిమానాతో సరి పెట్టకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపి, వారికి అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు.హెల్మెట్ ధరించక పోవడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, వారిచేత తక్షణమే హెల్మెట్ల ను కొనుగోలు చేయించారు.ఈ సందర్భంగా ఎస్ఐ డి రామకృష్ణ మాట్లాడుతూ
హెల్మెట్ భారం కాదు ఆది ప్రాణ రక్ష అని ద్విచక్ర వాహనదారులు తలపై హెల్మెట్ ధరించడం భారం అని భావించకూడదని, అది ప్రాణానికి శ్రీరామ రక్ష వంటిదని, ప్రమాదం జరిగి నప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకం కావచ్చు, ఆ సమయంలో హెల్మెట్ కాపాడుతుందని,
వాహనాలు నడిపే సమయాలలో కుటుంబ బాధ్యత గుర్తుంచుకొని వాహనంపై బయటకు వెళ్ళినప్పుడు, క్షేమం కోసం కుటుంబ సభ్యులు ఇంటి వద్ద వేచి ఉంటారని, ఏదైనా అపశ్రుతి జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని తమ కోసం కాకపోయినా, తమ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలకు గురవు తున్న వారిలో అత్యధిక శాతం యువతే ఉంటున్నారని, సరైన రక్షణ లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు గాలి లో కలిసి పోతున్నాయని, వేగాన్ని తగ్గించి, రక్షణ కవచమైన హెల్మెట్ను విధిగా ధరించాలని కోరారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి