హెచ్పీఎస్లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హెచ్పీఎస్లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Editor Desk
భువనగిరి : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ విద్యార్థుల మొదటి తరగతి డే స్కాలర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 29 వరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలని, 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్ కార్యాలయాల నుంచి పొందాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదన్నారు. జూన్ 1న కలెక్టరేట్లో లాటరీ విధానంలో ఎంపిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్ కాంప్లెక్స్లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి