Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

హెచ్‌పీఎస్‌లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హెచ్‌పీఎస్‌లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హెచ్‌పీఎస్‌లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
18-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌)లో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ విద్యార్థుల మొదటి తరగతి డే స్కాలర్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 29 వరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలని, 2019 జూన్‌ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి పొందాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదన్నారు. జూన్‌ 1న కలెక్టరేట్‌లో లాటరీ విధానంలో ఎంపిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Sthanikam

హెచ్‌పీఎస్‌లో ఎస్సీ విద్యార్థులకు అవకాశం. మొదటి తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

భువనగిరి : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌)లో 2026–27 విద్యాసంవత్సరానికి ఎస్సీ విద్యార్థుల మొదటి తరగతి డే స్కాలర్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 29 వరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అభ్యర్థులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారై ఉండాలని, 2019 జూన్‌ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి పొందాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదన్నారు. జూన్‌ 1న కలెక్టరేట్‌లో లాటరీ విధానంలో ఎంపిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News