హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల
హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల
Krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ
మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన వాలంటరీ టీషర్ట్లను మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాలోత్ కవిత పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండి పనిచేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని మాలోత్ కవిత భరోసా ఇచ్చారు. మేడారం జాతర సమయంలో వాలంటీర్ల సేవలు ఎంతో కీలకమని, వారి గుర్తింపుగా టీషర్ట్లు ప్రారంభించడం మంచి ఆలోచనగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవీన్, బండమీది సంపత్, ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ బద్దే వీరభద్రం, శ్రీనివాసు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి