Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల
January 29, 2026 01:27 AM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన వాలంటరీ టీషర్ట్లను మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాలోత్ కవిత పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండి పనిచేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని మాలోత్ కవిత భరోసా ఇచ్చారు. మేడారం జాతర సమయంలో వాలంటీర్ల సేవలు ఎంతో కీలకమని, వారి గుర్తింపుగా టీషర్ట్లు ప్రారంభించడం మంచి ఆలోచనగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవీన్, బండమీది సంపత్, ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ బద్దే వీరభద్రం, శ్రీనివాసు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News