Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:22 PM

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల

హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేడారం జాతర వాలంటరీ టీషర్ట్లు విడుదల
January 29, 2026 01:27 AM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన వాలంటరీ టీషర్ట్లను మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాలోత్ కవిత పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండి పనిచేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సేవలు అభినందనీయమని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని మాలోత్ కవిత భరోసా ఇచ్చారు. మేడారం జాతర సమయంలో వాలంటీర్ల సేవలు ఎంతో కీలకమని, వారి గుర్తింపుగా టీషర్ట్లు ప్రారంభించడం మంచి ఆలోచనగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవీన్, బండమీది సంపత్, ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ బద్దే వీరభద్రం, శ్రీనివాసు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News