Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:58 AM

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘన నిర్వహణ

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘన నిర్వహణ

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘన నిర్వహణ
December 23, 2025 02:34 AM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రామానుజన్ జయంతి వేడుకలు

స్థానికం ప్రతినిధి

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత విభాగం ఆధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకుని జరుపుకుంటామని తెలిపారు. గణిత ప్రాముఖ్యతను చాటడం, విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడం, దేశంలోని గొప్ప గణిత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని అన్నారు. సైన్స్, సాంకేతికత, ఆర్థికశాస్త్ర రంగాల్లో గణితం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. రామానుజన్ చేసిన అపూర్వ కృషిని స్మరించుకుంటూ గణితాన్ని కష్టమైన సబ్జెక్టుగా కాకుండా రోజువారీ జీవితంలో ఉపయోగపడే సాధనంగా చూడాలన్నారు.

ఈ సందర్భంగా గణిత సహాయ ఆచార్యులు ఎన్. నరసింహ మాట్లాడుతూ సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, మాక్ థీటా ఫంక్షన్లు, అవిచ్ఛిన్న భిన్నాలు వంటి పరిశోధనా రంగాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే గాస్, జాకోబి, యూలర్ వంటి సమకాలీన గణిత శాస్త్రవేత్తల కృషిపై కూడా ప్రసంగించారు.

జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, గణిత క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ మధు, డాక్టర్ మక్లా, విద్యాసాగర్, రమాదేవి, పెదయ్య తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News