Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు
May 17, 2026 04:35 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని సూచించారు. విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు.

ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను బహుమతులతో సత్కరించారు. తెలంగాణ పీజీసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన తేజశ్రీ, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగం సాధించిన అనిల్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి. మధు, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం సమన్వయకర్త డాక్టర్ అపర్ణాచతుర్వేది, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ. యాదగిరిరెడ్డి, డాక్టర్ ఎస్. శారద తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News