Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు
17-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని సూచించారు. విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు.

ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను బహుమతులతో సత్కరించారు. తెలంగాణ పీజీసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన తేజశ్రీ, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగం సాధించిన అనిల్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి. మధు, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం సమన్వయకర్త డాక్టర్ అపర్ణాచతుర్వేది, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ. యాదగిరిరెడ్డి, డాక్టర్ ఎస్. శారద తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

Article Image

హయత్‌నగర్: తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని సూచించారు. విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు.

ఈ సందర్భంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను బహుమతులతో సత్కరించారు. తెలంగాణ పీజీసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన తేజశ్రీ, తెలంగాణ హైకోర్టులో ఉద్యోగం సాధించిన అనిల్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి. మధు, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం సమన్వయకర్త డాక్టర్ అపర్ణాచతుర్వేది, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ. యాదగిరిరెడ్డి, డాక్టర్ ఎస్. శారద తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News