Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 10:17 PM

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

హయత్ నగర్ లో పూర్వ   విద్యార్థుల సమావేశం
May 14, 2026 08:33 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో గురువారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించి విద్యార్థుల సంఘం బాధ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్‌బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థుల ప్రగతి, కళాశాల అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ శివపురం సుబ్రమణ్యం మాట్లాడుతూ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి అభివృద్ధికి కళాశాల చేయూతనిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.

సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి చెరుకూరి మధు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తమ సంఘం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News