హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం
హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం
Editor Desk
హయత్నగర్: విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో గురువారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించి విద్యార్థుల సంఘం బాధ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థుల ప్రగతి, కళాశాల అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు.
పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ శివపురం సుబ్రమణ్యం మాట్లాడుతూ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి అభివృద్ధికి కళాశాల చేయూతనిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.
సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి చెరుకూరి మధు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తమ సంఘం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి