PRINT TIME: May 12, 2026 10:08 PM
హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు
హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు
May 12, 2026 08:34 PM
29 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని: హనుమాన్ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
అంబేద్కర్నగర్లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్పేట్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి