హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
RAPOLU LINGASWAMY
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న భవ్య శోభాయాత్రను విజయవంతం చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు బి.ఎన్.రెడ్డి నగర్ చౌరస్తా నుంచి సాహెబ్నగర్లోని శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం వరకు హనుమాన్ జీ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, భక్తి, శక్తి, ఐక్యతకు ప్రతీకగా నిర్వహించే ఈ శోభాయాత్రలో భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా పాల్గొననున్నట్లు వెల్లడించారు.
భక్తులు క్రమశిక్షణతో, ఉత్సాహంగా పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని సుధీర్ రెడ్డి కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి