Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:31 AM

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
January 09, 2026 05:37 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని అర్థమైపోయిందని, అందుకే రాష్ట్రంలో అడ్డూ అదుపు లేని పాలన సాగుతోందనిమాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. “ఎట్లున్న రాష్ట్రం ఎట్లాయిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు” అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కానీ ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు.

సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోతున్నారని, ఇచ్చిన హామల సంగతి దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా కొనసాగించలేకపోతున్నారని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు.పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

అలాగే, ఆడబిడ్డల పెండ్లిళ్లకు కేసీఆర్ అందించిన లక్ష రూపాయల సహాయం, తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తూ,మహిళలు,విద్యార్థులు,నిరుద్యోగులు, పేదలకు ఇచ్చిన హామీలు ఎటుపోయాయని నిలదీశారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు ఇండ్ల ముందుకు వస్తే ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు ఓపిక పట్టితే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఐక్యతతో విజయాలు సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News