Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:51 PM

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
January 09, 2026 05:37 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని అర్థమైపోయిందని, అందుకే రాష్ట్రంలో అడ్డూ అదుపు లేని పాలన సాగుతోందనిమాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. “ఎట్లున్న రాష్ట్రం ఎట్లాయిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు” అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కానీ ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు.

సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోతున్నారని, ఇచ్చిన హామల సంగతి దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా కొనసాగించలేకపోతున్నారని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు.పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

అలాగే, ఆడబిడ్డల పెండ్లిళ్లకు కేసీఆర్ అందించిన లక్ష రూపాయల సహాయం, తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తూ,మహిళలు,విద్యార్థులు,నిరుద్యోగులు, పేదలకు ఇచ్చిన హామీలు ఎటుపోయాయని నిలదీశారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు ఇండ్ల ముందుకు వస్తే ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు ఓపిక పట్టితే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఐక్యతతో విజయాలు సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News