Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం
February 20, 2026 05:39 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామ ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలవాలనే సంకల్పంతో సర్పంచ్ కనుకగా ఆడపడుచులకు 5,116 రూపాయల నగదు అందించే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, సింగీతం ఆడబిడ్డల వివాహాలకు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పిన మాటను సర్పంచ్ శ్రావణి నిరంజన్ నిలబెట్టుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దగొల్ల అనుషమ్మ – బాబు కుమార్తె శ్రీలత వివాహ మహోత్సవానికి హాజరై మొదటి కానుకగా 5,116 రూపాయలను అందజేశారు. మన గ్రామ ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలని, వారి తల్లిదండ్రులకు వివాహ సమయంలో కొంత ఆర్థిక భరోసా కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.గ్రామ అభివృద్ధి మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఆడపడుచుకు అవసరమైనప్పుడు గ్రామ పంచాయతీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్, కే శామయ్య, శివయ్య, అంజయ్య, శ్రీశైలం, భరత్, కే నిరంజన్, హరికృష్ణ, సుధాకర్, మనోజ్, పీజీ శ్రీకాంత్, పీజీ శ్రీశైలం, కే ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News