Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:10 PM

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం

హామీ నిలబెట్టుకున్న సింగీతం సర్పంచ్ – ఆడబిడ్డలకు 5,116 రూపాయల సహాయం
February 20, 2026 05:39 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సింగీతం గ్రామ ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలవాలనే సంకల్పంతో సర్పంచ్ కనుకగా ఆడపడుచులకు 5,116 రూపాయల నగదు అందించే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, సింగీతం ఆడబిడ్డల వివాహాలకు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పిన మాటను సర్పంచ్ శ్రావణి నిరంజన్ నిలబెట్టుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దగొల్ల అనుషమ్మ – బాబు కుమార్తె శ్రీలత వివాహ మహోత్సవానికి హాజరై మొదటి కానుకగా 5,116 రూపాయలను అందజేశారు. మన గ్రామ ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలని, వారి తల్లిదండ్రులకు వివాహ సమయంలో కొంత ఆర్థిక భరోసా కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు.గ్రామ అభివృద్ధి మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఆడపడుచుకు అవసరమైనప్పుడు గ్రామ పంచాయతీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్, కే శామయ్య, శివయ్య, అంజయ్య, శ్రీశైలం, భరత్, కే నిరంజన్, హరికృష్ణ, సుధాకర్, మనోజ్, పీజీ శ్రీకాంత్, పీజీ శ్రీశైలం, కే ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News