హలో కార్మిక - చలో కోటి
హలో కార్మిక - చలో కోటి
Harish K
25న కోటిలో మహాధర్నాకు పిలుపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్ కోటి డీఎంఈ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య తెలిపారు. సూర్యాపేట జీజీహెచ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
జీవో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, కార్మికులను IFMISలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా నాగభూషణ్, ఉపాధ్యక్షులుగా రవి, త్రివేణి, ప్రధాన కార్యదర్శిగా మౌనిక, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా లక్ష్మణ్, ప్రచార కమిటీగా మధుకర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్
రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, ప్రవీణ్, భూషణ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి