Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి

హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి

హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి
14-02-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ ఘటన హైద

అధికారుల సమాచారం మేరకు, వ్యక్తిగత పనిమీద హైదరాబాద్‌కు వచ్చిన వెంకటేశ్వరరావు ఇమ్లిబన్ బస్టాండ్‌లో అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలడంతో సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతిగా నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మేకల వెంకటేశ్వరరావు గతంలో ఇదే మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం నేరడ పంచాయతీలో కార్యదర్శిగా సేవలందిస్తూ, విధుల్లో నిబద్ధతతో పనిచేసేవారిగా సహచరుల ప్రశంసలు పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.

ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సేవాభావంతో పనిచేసే నిబద్ధత గల అధికారి కోల్పోవడం బాధాకరం” అంటూ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి

Article Image

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ ఘటన హైద

అధికారుల సమాచారం మేరకు, వ్యక్తిగత పనిమీద హైదరాబాద్‌కు వచ్చిన వెంకటేశ్వరరావు ఇమ్లిబన్ బస్టాండ్‌లో అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలడంతో సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతిగా నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మేకల వెంకటేశ్వరరావు గతంలో ఇదే మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం నేరడ పంచాయతీలో కార్యదర్శిగా సేవలందిస్తూ, విధుల్లో నిబద్ధతతో పనిచేసేవారిగా సహచరుల ప్రశంసలు పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.

ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సేవాభావంతో పనిచేసే నిబద్ధత గల అధికారి కోల్పోవడం బాధాకరం” అంటూ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News