హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి
హైదరాబాదులో గుండెపోటుతో నేరడ పంచాయతీ కార్యదర్శి మృతి
Komidala Mahender reddy
చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఈ ఘటన హైద
అధికారుల సమాచారం మేరకు, వ్యక్తిగత పనిమీద హైదరాబాద్కు వచ్చిన వెంకటేశ్వరరావు ఇమ్లిబన్ బస్టాండ్లో అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలడంతో సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతిగా నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మేకల వెంకటేశ్వరరావు గతంలో ఇదే మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం నేరడ పంచాయతీలో కార్యదర్శిగా సేవలందిస్తూ, విధుల్లో నిబద్ధతతో పనిచేసేవారిగా సహచరుల ప్రశంసలు పొందారు. ఈ ఏడాది సెప్టెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నట్లు సమాచారం.
ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సేవాభావంతో పనిచేసే నిబద్ధత గల అధికారి కోల్పోవడం బాధాకరం” అంటూ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు మృతితో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి