హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్
హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్
Komidala Mahender reddy
నల్గొండ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
సంక్రాంతి పండగ ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి ఒకేసారి భారీగా వాహనాలు చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ట్రాఫిక్ రద్దీ నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా వాహనాల రద్దీ ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా దారి మళ్లింపులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు
1. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.
2. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.
3. నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:
నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (ఎన్హెచ్-65) మీదుగా హైదరాబాద్.
4. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు:
కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.
5. ఎన్హెచ్-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పక్షంలో:
చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్కు వాహనాలను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రత్యామ్నాయ మార్గాల వినియోగంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గి, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ సందేశం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ,
“సంక్రాంతి పండగ అనంతరం హైదరాబాద్కు వెళ్లే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ వల్ల అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఓర్పుతో ప్రయాణించాలి” అని కోరారు.
పండగ రోజులలో కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి