Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్‌పై ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ

హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్‌పై ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ

హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్‌పై ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ
February 19, 2026 07:21 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు: జిల్లా కలెక్టర్ హనుమంత రావు

National Health Mission తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం,హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు (ANMs) హై-రిస్క్ గర్భిణీ ట్రాకింగ్ మరియు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. ప్రతి గర్భిణి స్త్రీని గర్భధారణ మొదటి నెల నుంచే నమోదు చేసి,ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హై-రిస్క్ గర్భిణీ కేసులను ముందుగానే గుర్తించి, క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానల్లో సిబ్బంది కొరత కారణంగా కొంతమంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని తెలిపారు. అక్కడ అవసరం లేకపోయినా భయపెట్టి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర సిజేరియన్ ఆపరేషన్లను అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని,వైద్యులు నార్మల్ డెలివరీలు జరిగేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. మనోహర్ మాట్లాడుతూ, అన్ని MPHA (F)లకు హై-రిస్క్ గర్భిణీ ప్రోటోకాల్స్ ప్రాముఖ్యతను వివరించారు. హై–రిస్క్ కేసులను తొందరగా గుర్తించడం ద్వారా సమయానుకూలంగా మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో సమయానికి రిఫరల్ చేయడంపై కూడా అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా కృషి చేయాలని సూచించారు. అర్మాన్ ట్రైనింగ్ బృందానికి చెందిన డా.భవాని మరియు డా.రోహిణి హై-రిస్క్ గర్భిణీ ప్రోటోకాల్స్‌పై సవివరంగా శిక్షణ అందించారు.ఈ కార్యక్రమంలో డా. యశోద (ప్రోగ్రాం అధికారి–MHN),డా.రామకృష్ణ (ప్రోగ్రాం అధికారి-CH&I),డా.వీణ (ప్రోగ్రాం అధికారి-NCD),డా.వంశీ కృష్ణ (ప్రోగ్రాం అధికారి-NTEP) తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News