Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:55 AM

హామీలకు కార్యరూపం… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

హామీలకు కార్యరూపం… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

హామీలకు కార్యరూపం… ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
January 02, 2026 12:25 PM 307 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇచ్చిన హామీలకు కార్యరూపం… బోగారం గ్రామంలో అభివృద్ధి బాటలో సర్పంచ్

రామన్నపేట – స్థానిక ప్రతినిధి

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్పంచ్‌గా కునూరు సాయికుమార్ గౌడ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన ఊరు – మన బడి” అన్న భావన ప్రతి గ్రామస్తుడిలో ఉండాలని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదేనని స్పష్టం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో పాఠశాల సమగ్ర అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాల ప్రాంగణంలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, విలువలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముస్కు వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్, మేడి ఆంజనేయులు దేవి, నేరటి మానస సురేష్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్, వనం అండాలు యాదగిరి పాల్గొన్నారు. అలాగే పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ అంతటి ధనమ్మ మల్లేశం,, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News