Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:39 PM

హామీలే ఎక్కువ… అభివృద్ధి శూన్యం.మాజీ ఎమ్మెల్యే లింగయ్య

హామీలే ఎక్కువ… అభివృద్ధి శూన్యం.మాజీ ఎమ్మెల్యే లింగయ్య

హామీలే ఎక్కువ… అభివృద్ధి శూన్యం.మాజీ ఎమ్మెల్యే లింగయ్య
January 04, 2026 02:17 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాలలో కాంగ్రెస్ వైఫల్యాలపై బాకీ కార్డుల పంపిణీ

చిట్యాల స్థానిక ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డు చంద్రపురి కాలనీలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బాకీ కార్డుల కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు చెల్లించాల్సిన హామీల బాకీని కార్డుల రూపంలో వివరించుతూ ఆయన వార్డులలో పర్యటించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన తీరును వివరించారు. బిఆర్ఎస్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా గాలిలో కలిసిపోయాయో వివరించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కిన నాటి నుంచి అదే మోసపూరిత పంథాను కొనసాగిస్తోందని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా శూన్యమని అన్నారు.కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడానికే చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీకోసం కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 30 కోట్ల రూపాయలతో పట్టణంలో అనేక సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠదామాలు, కుల సంఘ భవనాలు వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండేళ్లుగా పట్టణంలో ఒక్కరోజు కూడా పర్యటించిన దాఖలాలు లేవని, పట్టణ సమస్యలపై స్పందించిన సందర్భమే లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేస్తుందని, ఎన్నికలు లేకపోతే ప్రజలను పూర్తిగా విస్మరిస్తుందని విమర్శించారు.రేవంత్ రెడ్డి పాలనలో పార్టీ నాయకులు సంచులు మోయడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెబుతారని అన్నారు.

కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, రేవంత్ రెడ్డి పాలనలో జరిగిన పనులను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మున్సిపాలిటీ ప్రజలకు నిజమైన లాభం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News