గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండల కేంద్రంలో గల సాయి గ్రామర్ పాఠశాల నాల్గవ తరగతి విద్యార్థులు తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వేమన యశ్విత, రేపాల గీతికా శ్రీ, కొండా వర్షిత్, ఎడపల్లి మణిదీప్ లు ఈ ఘనత సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు గురువారం విద్యార్థులను అభినందించి, స్వీట్లు పంచి, క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దీప్తి, ఉమా, లావణ్య, అరుణ, ఇందు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి