Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:06 PM

గురుజువాడకు గర్వకారణం… బంగారు నంది అవార్డు అందుకున్న:ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి. చంద్రశేఖర్

గురుజువాడకు గర్వకారణం… బంగారు నంది అవార్డు అందుకున్న:ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి. చంద్రశేఖర్

గురుజువాడకు గర్వకారణం… బంగారు నంది అవార్డు అందుకున్న:ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి. చంద్రశేఖర్
January 25, 2026 07:16 PM 250 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌కు ప్రతిష్టాత్మక బంగారు నంది అవార్డు లభించడం విశేషం.రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ మరియు రుద్ర టీవీ ఆధ్వర్యంలో, సంస్థ అధినేత పి. రుద్ర శ్రీనివాస్ రావు వివిధ కళారంగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను గుర్తించి, వారి కళాసాధనకు ప్రోత్సాహంగా బంగారు నంది అవార్డులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ప్రాంతం, కోహిర్ మండలం, గురుజువాడ గ్రామానికి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి. చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ విభాగంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. సినిమాటోగ్రఫీ రంగంలో ఆయన చూపిన అసాధారణ ప్రతిభ, దృశ్యాల రూపకల్పనలో కనబరిచిన సృజనాత్మకతకు ఈ అవార్డు రూపంలో గుర్తింపు లభించింది.స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు, కళాకారుల్లో దాగి ఉన్న కలలను గుర్తుచేస్తూ,వారు మరింత ఎదగడానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.ఈ అవార్డు జహీరాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News