Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 03:31 PM

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి

గుర్తుతెలియని కారు ఢీకొని కూలీ మృతి
March 10, 2026 10:53 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

తూప్రాన్‌పేట్ వద్ద రోడ్డు ప్రమాదం… చికిత్స పొందుతూ యువకుడు మృతి

రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన తూప్రాన్‌పేట్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన శంకర్ సహ్ని (25) తూప్రాన్‌పేట్ గ్రామంలోని సాయి వికాస్ క్యాస్టింగ్ కంపెనీలో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి సమయంలో సరుకులు కొనుగోలు చేసేందుకు తూప్రాన్‌పేట్ గ్రామంలోని చాచా దాబా పక్కన ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లాడు.సరుకులు తీసుకుని తిరిగి రోడ్డు దాటుతున్న సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శంకర్ సహ్నికి కుడి కాలు తొడ భాగంలో, ముఖంపై తీవ్ర రక్తగాయాలు అయ్యాయి.

స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి శంకర్ సహ్ని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి సిఐ జి. మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News