Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రాష్ట్ర సచివాలయం లో కన్ఫరెన్స్ లో సత్యసాయి జిల్లా ఎస్.పి, కలెక్టర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 04:24 PM

గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గ్రామస్తులు

గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గ్రామస్తులు

గుక్కెడు నీటి కోసం  అల్లాడుతున్న గ్రామస్తులు
May 09, 2026 03:26 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో సత్యసాయి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా తాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలోని బీసీ కాలనీలో వందకు పైగా ఇళ్లు ఉన్నప్పటికీ ఒక్క కొళాయి మాత్రమే ఉందని, అందులోనూ నీరు సరిగా రావడం లేదని మహిళలు తెలిపారు. కనీసం ఒక్కింటికి ఒక బిందెడు నీరు కూడా అందడం లేదని వాపోయారు. ఇదే నీటిని తాగునీటిగా వినియోగిస్తున్నామని, ఒకే కొళాయితో అందరికీ నీరు పట్టుకోవడం అసాధ్యమని చెప్పారు. కాలనీలో కనీసం మూడు లేదా నాలుగు కొళాయిలు ఏర్పాటు చేస్తే సమస్య కొంతవరకు తీరుతుందని సూచించారు.వేసవి కారణంగా నీటి అవసరం పెరిగిన సమయంలో సరఫరా నిలిచిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. అయితే శుద్ధజలం పేరుతో తీసుకొచ్చే ట్యాంకర్ నీరు తాగితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. వెంటనే సత్యసాయి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, సమస్యల పరిష్కారం కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు నల్లమాడ పంపుహౌజ్ వద్ద ఆరు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. తమకు రావలసిన వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే బకాయి వేతనాలు చెల్లించి నీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని బీసీ కాలనీ వాసులు కోరారు.

ఈ నిరసనలో చెన్నకృష్ణమ్మ, శివమ్మ, లక్ష్మి, లక్ష్మీనరసమ్మ, వెంకటరమణమ్మ, నరసమ్మ, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News