గుంజేటిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కాంగ్రెస్ నాయకుల హాజరు – కుటుంబానికి శుభాకాంక్షలు
గుంజేటిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కాంగ్రెస్ నాయకుల హాజరు – కుటుంబానికి శుభాకాంక్షలు
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్
న్యాల్కల్ మండలం గుంజేటి గ్రామానికి చెందిన గొల్ల కమలమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారుకార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు చంద్రప్ప, భాస్కర్ రెడ్డి, న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. అలాగే షంషల్లాపూర్ సర్పంచ్ అశ్విన్ పాటిల్, రామతీర్థ్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గణేష్పూర్ సర్పంచ్ బిరదర్ ప్రకాష్ పాటిల్, మాజీ ఎంపీటీసీ విశ్వనాథ్ హాజరై గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో గుంజేటి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ అడివప్ప పటేల్, వైస్ ప్రెసిడెంట్ టి.సదానంద్, టి.మారుతి, గడిల వీరన్న పాటిల్, బండి రవి పటేల్, బండి మహేష్, గడిల సందీప్, ఏ.సురేష్, కుందేళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి