గుంజ రేణుక నారాయణ నియామకం పై సీఎం రేవంత్రెడ్డికి వడ్డెర సంఘం కృతజ్ఞతలు
గుంజ రేణుక నారాయణ నియామకం పై సీఎం రేవంత్రెడ్డికి వడ్డెర సంఘం కృతజ్ఞతలు
Editor Desk
రామన్నపేట: వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా గుంజ రేణుక నారాయణను నియమించడం వడ్డెర కులానికి గౌరవప్రదమైన విషయమని వడ్డెర సంఘం నాయకులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండ్ల సమ్మయ్య మాట్లాడారు.
గత కొన్ని సంవత్సరాలుగా వడ్డెర కుల అభివృద్ధికి, ఎస్టీ సాధన కోసం గుంజ రేణుక నారాయణ నిరంతరం పోరాటం చేస్తున్నారని, అలాంటి నాయకుడికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, రాష్ట్ర అధ్యక్షుడు మంజుల రమేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు దుర్గయ్య, పట్టణ అధ్యక్షుడు పల్లపు రవి, దండ రాములు, గొలుసుల ప్రసాద్, శివరాత్రి సమ్మయ్య, శివరాత్రి యాదగిరి, పల్లపు అంజయ్య, శివరాత్రి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి