Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత
April 09, 2026 11:03 AM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు పని ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పని సమయంలో కూలీలకు ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానాన్ని అమలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం కూలీల గౌరవాన్ని దెబ్బతీస్తుందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించాలని, కూలీలకు అవసరమైన పని ముట్లు (పరికరాలు) సరఫరా చేయాలని కోరారు. కూలీల సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News