గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత
గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు పని ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పని సమయంలో కూలీలకు ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానాన్ని అమలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం కూలీల గౌరవాన్ని దెబ్బతీస్తుందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించాలని, కూలీలకు అవసరమైన పని ముట్లు (పరికరాలు) సరఫరా చేయాలని కోరారు. కూలీల సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి