శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఇండేన్ గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చొని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ బండి ఆలస్యంగా రావడం, సరిపడా సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు క్యూలో నిలబడటానికి ఇబ్బంది పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తెల్లవారుజాము నుంచే వచ్చి నిల్చున్నా, చివరకు సిలిండర్ దొరకక నిరాశగా వెనుదిరుగుతున్నారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సరఫరాను పెంచి, క్రమబద్ధంగా పంపిణీ చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి