నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 4వ వార్డు ఆఫీసర్స్ కాలనీకి చెందిన పూర్వ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి వడ్లకొండ సైదులు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ , నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైదులు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి