గుండెపోటుతో ఎన్జి కళాశాల అధ్యాపకుడి మృతి
గుండెపోటుతో ఎన్జి కళాశాల అధ్యాపకుడి మృతి
Editor Desk
నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న గొడుగు గోవర్ధనగిరి సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.
గత సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ మళ్లీ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు.
జిల్లాలోని అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గోవర్ధనగిరి గత ఎనిమిదేళ్లుగా ఎన్జి కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన మృతి కళాశాలకు తీరని లోటని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
మృతుడికి భార్య అలివేలు, కుమారుడు యశ్వంత్, కుమార్తె ఉన్నారు.
గోవర్ధనగిరి మృతి పట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు విభాగం అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్తో పాటు అధ్యాపకులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి