Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:59 PM

గుండెపోటుతో ఎన్‌జి కళాశాల అధ్యాపకుడి మృతి

గుండెపోటుతో ఎన్‌జి కళాశాల అధ్యాపకుడి మృతి

గుండెపోటుతో ఎన్‌జి కళాశాల అధ్యాపకుడి మృతి
23-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న గొడుగు గోవర్ధనగిరి సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

గత సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ మళ్లీ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు.

జిల్లాలోని అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గోవర్ధనగిరి గత ఎనిమిదేళ్లుగా ఎన్‌జి కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన మృతి కళాశాలకు తీరని లోటని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

మృతుడికి భార్య అలివేలు, కుమారుడు యశ్వంత్, కుమార్తె ఉన్నారు.

గోవర్ధనగిరి మృతి పట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు విభాగం అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

గుండెపోటుతో ఎన్‌జి కళాశాల అధ్యాపకుడి మృతి

Article Image

నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న గొడుగు గోవర్ధనగిరి సోమవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

గత సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ మళ్లీ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు.

జిల్లాలోని అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గోవర్ధనగిరి గత ఎనిమిదేళ్లుగా ఎన్‌జి కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన మృతి కళాశాలకు తీరని లోటని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

మృతుడికి భార్య అలివేలు, కుమారుడు యశ్వంత్, కుమార్తె ఉన్నారు.

గోవర్ధనగిరి మృతి పట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు విభాగం అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News