నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న బైకును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే టోల్ ప్లాజా అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో, హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ ఈ ప్రాంతంలో చేరింది. వారి కాన్వాయ్ దిగిన మంత్రి, బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. "ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి 10,000 కోట్ల నిధులతో హైదరాబాద్ - విజయవాడ హైవే 65 ని 8 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నాం," అని మంత్రి వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ, స్థానిక పోలీసులు ట్రాఫిక్ జామ్ను తొలగించి రాకపోకలను తిరిగి ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి