Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:40 AM

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
27-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మిప్రసన్న నర్సింహా గౌడ్, వార్డు సభ్యులు రాచకొండ శ్రీనివాస్ మంగ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారు పీటలపై కూర్చుండగా, పురోహితుడు రాగిచెడు జయంత్ కుమార్ సంప్రదాయ పద్ధతిలో కల్యాణ తంతును నిర్వహించారు.

కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భజనలు, మంగళహారతులతో పాల్గొని దేవుడి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఉత్సవ శోభ వెల్లివిరిసింది.

Sthanikam

గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం

Article Image

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మిప్రసన్న నర్సింహా గౌడ్, వార్డు సభ్యులు రాచకొండ శ్రీనివాస్ మంగ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారు పీటలపై కూర్చుండగా, పురోహితుడు రాగిచెడు జయంత్ కుమార్ సంప్రదాయ పద్ధతిలో కల్యాణ తంతును నిర్వహించారు.

కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భజనలు, మంగళహారతులతో పాల్గొని దేవుడి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఉత్సవ శోభ వెల్లివిరిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News