PRINT TIME: March 27, 2026 09:52 PM
గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
గుండ్రాంపల్లిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
March 27, 2026 08:02 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మిప్రసన్న నర్సింహా గౌడ్, వార్డు సభ్యులు రాచకొండ శ్రీనివాస్ మంగ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారు పీటలపై కూర్చుండగా, పురోహితుడు రాగిచెడు జయంత్ కుమార్ సంప్రదాయ పద్ధతిలో కల్యాణ తంతును నిర్వహించారు.
కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భజనలు, మంగళహారతులతో పాల్గొని దేవుడి ఆశీస్సులు పొందారు. గ్రామంలో ఉత్సవ శోభ వెల్లివిరిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి