Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
April 01, 2026 04:44 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరిలో రూ.30కే భోజనం-గోవిందాస్ క్యాంటీన్

పేదల కోసం వినూత్నసేవ-దవా చాయ్‌తో గోవిందాస్ క్యాంటీన్

తక్కువ ధరకే పోషకాహారం-భువనగిరిలో ప్రజలకు వరంగా గోవిందాస్ క్యాంటీన్

భువనగిరి పట్టణంలో సామాన్య ప్రజలు, నిరుపేదలు మరియు పట్టణానికి నిత్యం వచ్చే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు ‘గోవిందాస్ క్యాంటీన్’ ప్రారంభమైంది.స్థానిక బంజారాహిల్స్ సాధన హై స్కూల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ను భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్,31వ వార్డు కౌన్సిలర్ షఫీ అహ్మద్ బుధవారం ప్రారంభించారు.పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యుడికి పౌష్టికాహారం అందించడం భారంగా మారుతున్న తరుణంలో,విద్యానగర్ ఇస్కాన్ టెంపుల్ ఇంచార్జ్ సిద్ధి స్వరూప్ దాస్ ప్రభు ఆధ్వర్యంలో కేవలం రూ.30కే కడుపునిండా భోజనం అందించాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,గోవిందాస్ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయని,భువనగిరిలో పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.తక్కువ ధర అయినప్పటికీ రుచి,నాణ్యత,శుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కేవలం భోజనమే కాకుండా,ఆరోగ్యానికి మేలు చేసే‘దవా చాయ్’(మూలికా టీ) అందించడం ఈ క్యాంటీన్ ప్రత్యేకతగా నిలిచింది.తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ చాయ్‌ను రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.హోటళ్లలో అధిక ఖర్చుతో కూడిన భోజనానికి ప్రత్యామ్నాయంగా,ఇంటి వంటను తలపించేలా పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.క్యాంటీన్ ప్రారంభం పట్ల పట్టణ ప్రజలు,కూలీలు,మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు కావాలని చైర్మన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకట్ నాయక్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల ఆదినారాయణ,బాదం ప్రకాష్ గుప్త,కృష్ణ కాంత్,సాయి ప్రశాంత్,శ్రీనివాస్,రమేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News