Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 07:56 PM

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

గోవిందాస్ క్యాంటీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
April 01, 2026 04:44 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరిలో రూ.30కే భోజనం-గోవిందాస్ క్యాంటీన్

పేదల కోసం వినూత్నసేవ-దవా చాయ్‌తో గోవిందాస్ క్యాంటీన్

తక్కువ ధరకే పోషకాహారం-భువనగిరిలో ప్రజలకు వరంగా గోవిందాస్ క్యాంటీన్

భువనగిరి పట్టణంలో సామాన్య ప్రజలు, నిరుపేదలు మరియు పట్టణానికి నిత్యం వచ్చే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు ‘గోవిందాస్ క్యాంటీన్’ ప్రారంభమైంది.స్థానిక బంజారాహిల్స్ సాధన హై స్కూల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ను భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్,31వ వార్డు కౌన్సిలర్ షఫీ అహ్మద్ బుధవారం ప్రారంభించారు.పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యుడికి పౌష్టికాహారం అందించడం భారంగా మారుతున్న తరుణంలో,విద్యానగర్ ఇస్కాన్ టెంపుల్ ఇంచార్జ్ సిద్ధి స్వరూప్ దాస్ ప్రభు ఆధ్వర్యంలో కేవలం రూ.30కే కడుపునిండా భోజనం అందించాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,గోవిందాస్ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయని,భువనగిరిలో పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.తక్కువ ధర అయినప్పటికీ రుచి,నాణ్యత,శుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కేవలం భోజనమే కాకుండా,ఆరోగ్యానికి మేలు చేసే‘దవా చాయ్’(మూలికా టీ) అందించడం ఈ క్యాంటీన్ ప్రత్యేకతగా నిలిచింది.తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ చాయ్‌ను రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.హోటళ్లలో అధిక ఖర్చుతో కూడిన భోజనానికి ప్రత్యామ్నాయంగా,ఇంటి వంటను తలపించేలా పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.క్యాంటీన్ ప్రారంభం పట్ల పట్టణ ప్రజలు,కూలీలు,మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు కావాలని చైర్మన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకట్ నాయక్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల ఆదినారాయణ,బాదం ప్రకాష్ గుప్త,కృష్ణ కాంత్,సాయి ప్రశాంత్,శ్రీనివాస్,రమేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News