Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:45 PM

గౌతమ్ నగర్ డివిజన్ నుంచి బరిలో ఉంటా : ఠాగూర్ అరుణ్ సిం

గౌతమ్ నగర్ డివిజన్ నుంచి బరిలో ఉంటా : ఠాగూర్ అరుణ్ సిం

గౌతమ్ నగర్ డివిజన్ నుంచి  బరిలో ఉంటా  : ఠాగూర్ అరుణ్ సిం
January 24, 2026 09:13 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

రానున్న జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని తన అభిమానులు కోరుతున్నట్లు ప్రముఖ సంఘ సేవకులు ఠాగూర్ అరుణ్ సింగ్ తెలిపారు. జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ గా తాను చేసిన సేవా కార్యక్రమాలతో గౌతం నగర్ డివిజన్ ప్రజల్లో తనకు మంచి గుర్తింపు వచ్చిందని అరుణ్ సింగ్ అన్నారు. గౌతమ్ నగర్ ప్రజలు, అభిమానులు కోరిక మేరకు కార్పొరేటర్ పోటీ చేస్తానని.. గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆలయ చైర్మన్ గా తాను చేసిన సేవా కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్న గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయన్నారు. స్థానిక యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గౌతమ్ నగర్ డివిజన్ లో సేవా కార్యక్రమాలతో పాటు ఆలయాల అభివృద్ధి, గణపతి నవరాత్రి ఉత్సవాలు, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, పేద విద్యార్థులకు చదువు కోసం సహాయం, పేద మహిళల వివాహానికి తమ వంతు సహాయ సహకారాలు అందించానని గుర్తు చేశారు. గౌతమ్ నగర్ డివిజన్ లో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానని పేర్కొన్నారు. గౌతమ్ నగర్ డివిజన్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు సంపన్నుల అండదండలు తమకు ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో ఏ పార్టీ తమకు టికెట్ ఇచ్చినా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజులలో ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలతోతమ వంతు కృషి చేస్తానని తెలిపారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News