Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:21 PM

గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి

గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి

గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి
January 11, 2026 06:08 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


*గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మానం*


*గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలి*


తుంగతుర్తి:- అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు పులుసు యాదగిరి గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గౌడ సర్పంచులు, వార్డు మెంబర్లకు నిర్వహించిన ఆత్మీయ సన్మానంలో పాల్గొని మాట్లాడారు. గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘటితం కావాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో నూతనంగా సభ్యత్వ నమోదు తో పాటు సంఘం బలోపేతానికి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు గౌడ సంఘం నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్, మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, మాజీ రామాలయ కమిటీ చైర్మన్ పులుసు వెంకటనారాయణ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, తొట్ల సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ గడ్డం ఉప్పలయ్య గౌడ్, గుండగాని అంజయ్య గౌడ్, మద్దెల నర్సయ్య గౌడ్, చిర్ర నరేష్ గౌడ్, గుండగాని శ్రీనివాస్ గౌడ్, గుండగాని వీరయ్య గౌడ్, పాలకుర్తి వీరయ్య గౌడ్, కట్ల మల్లయ్య గౌడ్, బత్తుల జలేందర్ గౌడ్, గడ్డం సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్, ఉప సర్పంచ్ పొదిల యాదగిరి గౌడ్, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News