గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.
గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.
Sthanikam District Staff Reporter
మోత్కూరు:గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు యమగాని బుగ్గయ్య పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన 2026 క్యాలెండర్ ను ఆయన స్థానిక గౌడ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుగ్గయ్య మాట్లాడుతూ గీతా కార్మికులు,విద్య,వైద్యతో రాజకీయంగా వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన గీత కార్మికులలో ఉన్న విద్యార్థి,యువత,మేధావులు రాజకీయాలలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్,స్థానిక గీత కార్మికులుబత్తిని శ్రీనివాస్,అంబటి సోమయ్య,లోడే యాదయ్య,సూదగాని ముత్యాలు,బుర్ర నర్సయ్య , గనగాని చంద్రయ్య, బుంగ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి