Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్
March 11, 2026 06:58 PM 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు బుధవారం ఘనంగా ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి మాట్లాడుతూ... పదవ తరగతి విద్యార్థులు జీవితంలో ఒక ముఖ్యమైన దశలోకి అడుగుపెడుతున్నారని అన్నారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎలాంటి భయం లేదా ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు.ఎలా చదవాలి, సమాధానాలను ఎలా రాయాలి అనే విషయాలపై విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులుపాఠశాలకు, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు పాఖ్యాతులు తీసుకురావాలని కోరారు.అనంతరం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన మెటీరియల్ను అందజేశారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. ఈ ఫేర్వెల్ వేడుక విద్యార్థుల ఉత్సాహం, ఆనందంతో నిండిపోయి అందరికీ స్మరణీయంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి పుల్లయ్య, డి సుజాత, శ్రీదేవి, వెంకటరెడ్డి, రమేష్, సురేందర్, కిరణ్, మమత, అక్షర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నరాల తిరుమలరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News