Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:07 AM

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్
11-03-2026 265 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు బుధవారం ఘనంగా ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి మాట్లాడుతూ... పదవ తరగతి విద్యార్థులు జీవితంలో ఒక ముఖ్యమైన దశలోకి అడుగుపెడుతున్నారని అన్నారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎలాంటి భయం లేదా ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు.ఎలా చదవాలి, సమాధానాలను ఎలా రాయాలి అనే విషయాలపై విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులుపాఠశాలకు, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు పాఖ్యాతులు తీసుకురావాలని కోరారు.అనంతరం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన మెటీరియల్ను అందజేశారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. ఈ ఫేర్వెల్ వేడుక విద్యార్థుల ఉత్సాహం, ఆనందంతో నిండిపోయి అందరికీ స్మరణీయంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి పుల్లయ్య, డి సుజాత, శ్రీదేవి, వెంకటరెడ్డి, రమేష్, సురేందర్, కిరణ్, మమత, అక్షర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నరాల తిరుమలరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు బుధవారం ఘనంగా ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి మాట్లాడుతూ... పదవ తరగతి విద్యార్థులు జీవితంలో ఒక ముఖ్యమైన దశలోకి అడుగుపెడుతున్నారని అన్నారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎలాంటి భయం లేదా ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు.ఎలా చదవాలి, సమాధానాలను ఎలా రాయాలి అనే విషయాలపై విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులుపాఠశాలకు, గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు పాఖ్యాతులు తీసుకురావాలని కోరారు.అనంతరం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన మెటీరియల్ను అందజేశారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారు. ఈ ఫేర్వెల్ వేడుక విద్యార్థుల ఉత్సాహం, ఆనందంతో నిండిపోయి అందరికీ స్మరణీయంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి పుల్లయ్య, డి సుజాత, శ్రీదేవి, వెంకటరెడ్డి, రమేష్, సురేందర్, కిరణ్, మమత, అక్షర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నరాల తిరుమలరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News