తుంగతుర్తి ప్రతినిధి స్థానికం బండికిరణ్
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నేటి యువత వారి ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఆశా కార్యకర్తలు ,అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి