గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు
గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, EWS, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవిత ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
బాయ్స్ హైస్కూల్ పక్కన రూ.5 లక్షలు, అలాగే రామచంద్రారెడ్డి కాలనీలో చింతా రామచంద్రారెడ్డి గారి ఇంటి వద్ద మరో రూ.5 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీ గ్రాంట్ నిధులతో భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణచౌదరి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లలుచెరువు చంద్ర, 5-మెన్ కమిటీ సభ్యుడు గంగాధర్, గోరంట్ల టౌన్ కమిటీ సభ్యులు నాగేనాయక్, కూరమాల జయరాం, గిరిధర్ గౌడ్, బీరెవేణు, అజముతుల్లా, నిమ్మల శ్రీధర్, SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు D. ఉమాశంకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు D. శ్రీనివాసులు, అమరనాథ్, రవీంద్రనాయక్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధి దిశగా ఈ పనులు వేగంగా పూర్తిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి