Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డెడ్ స్టోరేజ్‌లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:45 AM

గోర్ బంజారా గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం

గోర్ బంజారా గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం

గోర్ బంజారా గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం
11-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కొండాపూర్ హనుమాన్ మందిర్ ప్రాంగణంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం నారాయణఖేడ్ గోర్ సిక్వాడి ఆధ్వర్యంలో గోర్ బంజారా గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సంగ్రామ్ మహారాజ్, శ్రీ రామ్ చేతన్ మహారాజ్, శ్రీ దేవీదాస్ మహారాజ్ చేతుల మీదుగా నారాయణఖేడ్ తాలూకాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాలు, పుష్పమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా సాధు సంతులు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తైన అనంతరం తాండాలలో వర్గ విభేదాలు, మనస్పర్థలు మరిచి ఐక్యతతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాండా అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్తుల సమిష్టి నిర్ణయంతో ముందుకు నడవాలని తెలిపారు.ముఖ్య అతిథులుగా పాల్గొన్న బాలా సాహెబ్, ఆర్.సి. చౌహాన్, యువ నాయకుడు సేవాలాల్ రాథోడ్ మాట్లాడుతూ సర్పంచ్‌లు తాండాలోని ప్రతి వర్గాన్ని కలుపుకొని సమన్వయంతో పాలన సాగించాలని తెలిపారు. బంజారా సమాజ ఐక్యతే అభివృద్ధికి మూలాధారమని పేర్కొన్నారు.బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన మహానీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇదే స్ఫూర్తితో నారాయణఖేడ్ తాలూకా స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, మాజీ నాయకులు అందరూ కలిసిమెలిసి ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం బాధ్యులు వి. మెగ్య నాయక్, కె. హరిసింగ్, కె. రాజ్ కుమార్, జిల్లా, డివిజన్ ప్రధాన బాధ్యులు గుర్నాథ్, శివ నాయక్, చందర్, గణపతి శివరాం నాయక్, గోపాల్ పాల్గొన్నారు. అలాగే గోర్ సిక్వాడి, గోర్ సేన బాధ్యులు బన్సీలాల్, బి. రాజు నాయక్, పెంట్యా నాయక్, మోతిరాం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

గోర్ బంజారా గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘన సన్మానం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కొండాపూర్ హనుమాన్ మందిర్ ప్రాంగణంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం నారాయణఖేడ్ గోర్ సిక్వాడి ఆధ్వర్యంలో గోర్ బంజారా గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సంగ్రామ్ మహారాజ్, శ్రీ రామ్ చేతన్ మహారాజ్, శ్రీ దేవీదాస్ మహారాజ్ చేతుల మీదుగా నారాయణఖేడ్ తాలూకాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాలు, పుష్పమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా సాధు సంతులు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తైన అనంతరం తాండాలలో వర్గ విభేదాలు, మనస్పర్థలు మరిచి ఐక్యతతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తాండా అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్తుల సమిష్టి నిర్ణయంతో ముందుకు నడవాలని తెలిపారు.ముఖ్య అతిథులుగా పాల్గొన్న బాలా సాహెబ్, ఆర్.సి. చౌహాన్, యువ నాయకుడు సేవాలాల్ రాథోడ్ మాట్లాడుతూ సర్పంచ్‌లు తాండాలోని ప్రతి వర్గాన్ని కలుపుకొని సమన్వయంతో పాలన సాగించాలని తెలిపారు. బంజారా సమాజ ఐక్యతే అభివృద్ధికి మూలాధారమని పేర్కొన్నారు.బంజారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన మహానీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇదే స్ఫూర్తితో నారాయణఖేడ్ తాలూకా స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, మాజీ నాయకులు అందరూ కలిసిమెలిసి ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం బాధ్యులు వి. మెగ్య నాయక్, కె. హరిసింగ్, కె. రాజ్ కుమార్, జిల్లా, డివిజన్ ప్రధాన బాధ్యులు గుర్నాథ్, శివ నాయక్, చందర్, గణపతి శివరాం నాయక్, గోపాల్ పాల్గొన్నారు. అలాగే గోర్ సిక్వాడి, గోర్ సేన బాధ్యులు బన్సీలాల్, బి. రాజు నాయక్, పెంట్యా నాయక్, మోతిరాం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News