Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

గొలుసుకట్టు కాలువల ద్వారా వర్టూరు చెరువును నింపి సాగునీరు అందించాలి: సిపిఐ డిమాండ్

గొలుసుకట్టు కాలువల ద్వారా వర్టూరు చెరువును నింపి సాగునీరు అందించాలి: సిపిఐ డిమాండ్

గొలుసుకట్టు కాలువల ద్వారా వర్టూరు చెరువును నింపి సాగునీరు అందించాలి: సిపిఐ డిమాండ్
April 08, 2026 09:12 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పరిధిలోని,వర్టూరు గ్రామ చెరువులను గొలుసుకట్టు కాలువల ద్వారా నింపి రైతులకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది.ఈరోజు వర్టూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.సిపిఐ పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు,పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఐకే దక్కిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ రైతులు,గ్రామీణ ప్రజల హక్కులను హరించుతోందని విమర్శించారు.కార్మిక చట్టాలలో మార్పులు చేసి,కాంట్రాక్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రైవేటు రంగానికి మద్దతు ఇస్తోందని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పథకాన్ని అమలు చేయకపోవడం, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు,వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్లు,రేషన్ కార్డులు,ఉపాధి హామీ కార్మికులకు చెల్లింపులు ఆలస్యం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పార్టీ నిధుల సేకరణ కూడా చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు.ఆలేరు నియోజకవర్గంలో తాగు,సాగునీటి కోసం సిపిఐ అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. గంధమల మరియు బస్వాపురం రిజర్వాయర్ల సాధనలో సిపిఐ పోరాటాలే కీలకమని పేర్కొన్నారు. రామాజీపేట చెరువును నింపి,నల్లబండ నుండి కాలువల ద్వారా మేడికుంటపల్లి,రాయికుంటపల్లి,వర్టూరు మీదుగా చందెపల్లి చెరువుకు నీటిని తరలిస్తే గొలుసుకట్టు వ్యవస్థ ద్వారా వేల ఎకరాల భూమి సస్యశ్యామలంగా మారుతుందని వివరించారు.గ్రామంలో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం,మండల కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న,శాఖ కార్యదర్శి సుదగాని వెంకన్న,సహాయ కార్యదర్శి పల్లె శ్రీనివాస్,సీనియర్ నాయకులు నల్ల రాములు,కర్రె సిద్ధులు,గువ్వ సిద్ధులు,పల్లె ప్రవీణ్ కుమార్,గువ్వ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News