గంజాయి స్వాధీనం
మునిపల్లి(అందోల్) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం బీదర్ నుంచి హైదరాబాద్కు బైక్పై గంజాయిని తరలిస్తున్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన మహమ్మద్ యాకూబ్ను కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో పట్టుకున్నారు.నిందితుడి వద్ద ఉన్న ఎండు గంజాయి,బైక్,సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.ఈ తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు అనుదీప్,హనుమంతు,అరుణజ్యోతి,అంజిరెడ్డి,సాయి,శివకాంత్,రాజేశ్,కృష్ణ పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి