Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త
16-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లిలో శుక్రవారం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ (32)కు బెల్లంపల్లి మండలం గురిజాలకు చెందిన సువర్ణ (29)తో ఐదేండ్ల కింద వివాహమైంది.వీరికి పిల్లలు లేరు. వినోద్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సువర్ణ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయింది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్‌ ఉన్నట్టుండి కిందపడిపోయాడు.గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే దహెగాంలోని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినోద్‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలచివేసింది.

Sthanikam

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

Article Image

అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లిలో శుక్రవారం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ (32)కు బెల్లంపల్లి మండలం గురిజాలకు చెందిన సువర్ణ (29)తో ఐదేండ్ల కింద వివాహమైంది.వీరికి పిల్లలు లేరు. వినోద్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సువర్ణ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయింది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్‌ ఉన్నట్టుండి కిందపడిపోయాడు.గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే దహెగాంలోని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినోద్‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలచివేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News