Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త

గంటల వ్యవధిలోనే దంపతులు మృతి..అనారోగ్యంతో చనిపోయిన భార్య తట్టుకోలేక భర్త
February 16, 2026 06:10 AM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనారోగ్యంతో చనిపోయిన భార్య అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే భర్త చనిపోయాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కమ్మర్‌పల్లిలో శుక్రవారం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ (32)కు బెల్లంపల్లి మండలం గురిజాలకు చెందిన సువర్ణ (29)తో ఐదేండ్ల కింద వివాహమైంది.వీరికి పిల్లలు లేరు. వినోద్‌ కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సువర్ణ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది.గురువారం రాత్రి 8 గంటలకు సువర్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయింది. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్‌ ఉన్నట్టుండి కిందపడిపోయాడు.గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే దహెగాంలోని పీహెచ్‌సీకి, అక్కడి నుంచి బెల్లంపల్లి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినోద్‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం కుటుంబసభ్యులు, గ్రామస్తులను కలచివేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News