Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:52 AM

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా
23-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణానికి చెందిన మునుగోటి వెంకన్న గతంలో GMR Groupలో కిందిస్థాయి సిబ్బందిగా నాలుగేళ్లు పనిచేశాడు. అనంతరం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడి ఉద్యోగాన్ని వీడి, మరో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న వెంకన్న ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విషయం తెలిసిన వెంటనే జీఎంఆర్ కార్పొరేట్ రిలేషన్ ఇన్‌చార్జ్ శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి సంజన రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు.మృతుని కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25,000 నగదు అందజేసి, వెంకన్న మూడేళ్ల కుమార్తె విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును తమ సంస్థ భరించేలా హామీ ఇచ్చారు. ఈ చర్యకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలుపుతూ జీఎంఆర్ ప్రతినిధుల మానవత్వాన్ని అభినందించారు.

సాధారణంగా కార్పొరేట్ సంస్థలు మాజీ ఉద్యోగుల విషయంలో పెద్దగా స్పందించని సందర్భాలు ఉన్నప్పటికీ, మాజీ సిబ్బంది కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ సంస్థ చర్య పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Sthanikam

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

Article Image

చిట్యాల పట్టణానికి చెందిన మునుగోటి వెంకన్న గతంలో GMR Groupలో కిందిస్థాయి సిబ్బందిగా నాలుగేళ్లు పనిచేశాడు. అనంతరం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడి ఉద్యోగాన్ని వీడి, మరో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న వెంకన్న ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విషయం తెలిసిన వెంటనే జీఎంఆర్ కార్పొరేట్ రిలేషన్ ఇన్‌చార్జ్ శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి సంజన రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు.మృతుని కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25,000 నగదు అందజేసి, వెంకన్న మూడేళ్ల కుమార్తె విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును తమ సంస్థ భరించేలా హామీ ఇచ్చారు. ఈ చర్యకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలుపుతూ జీఎంఆర్ ప్రతినిధుల మానవత్వాన్ని అభినందించారు.

సాధారణంగా కార్పొరేట్ సంస్థలు మాజీ ఉద్యోగుల విషయంలో పెద్దగా స్పందించని సందర్భాలు ఉన్నప్పటికీ, మాజీ సిబ్బంది కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ సంస్థ చర్య పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News