Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 02:56 PM

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా

GMR Group ఉద్యోగుల మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా
February 23, 2026 08:51 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

చిట్యాల పట్టణానికి చెందిన మునుగోటి వెంకన్న గతంలో GMR Groupలో కిందిస్థాయి సిబ్బందిగా నాలుగేళ్లు పనిచేశాడు. అనంతరం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడి ఉద్యోగాన్ని వీడి, మరో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న వెంకన్న ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విషయం తెలిసిన వెంటనే జీఎంఆర్ కార్పొరేట్ రిలేషన్ ఇన్‌చార్జ్ శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి సంజన రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు.మృతుని కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25,000 నగదు అందజేసి, వెంకన్న మూడేళ్ల కుమార్తె విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును తమ సంస్థ భరించేలా హామీ ఇచ్చారు. ఈ చర్యకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలుపుతూ జీఎంఆర్ ప్రతినిధుల మానవత్వాన్ని అభినందించారు.

సాధారణంగా కార్పొరేట్ సంస్థలు మాజీ ఉద్యోగుల విషయంలో పెద్దగా స్పందించని సందర్భాలు ఉన్నప్పటికీ, మాజీ సిబ్బంది కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ సంస్థ చర్య పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News