Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:42 AM

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర
January 25, 2026 07:16 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రం

జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరం సీతారామచంద్రస్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ధరూరి సింగరాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు. భక్తులచే సామూహికంగా ఆదిత్య హృదయ పారాయణం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, సూర్యనారాయణ స్వామికి మహా నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.తదుపరి సూర్యప్రభ వాహనంపై స్వామివారి శోభాయాత్ర పట్టణంలో వైభవంగా సాగింది. శోభాయాత్రలో కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు రాచూరి వెంకటేశ్వలు, కార్యదర్శి నకిరేకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, గడ్డం వెంకన్న, గండూరి రమేష్, దంతాల సందీప్, అంతటి దినేష్, షీలా శంకర్, చిత్తలూరు శ్రీధర్, కక్కిరేణి విజయ్ కుమార్, సోమ సుమన్, వెంకన్న, ఓరుగంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News