ఘనంగా రథసప్తమి శోభాయాత్ర
ఘనంగా రథసప్తమి శోభాయాత్ర
Biksham
జిల్లా కేంద్రం
జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరం సీతారామచంద్రస్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ధరూరి సింగరాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు. భక్తులచే సామూహికంగా ఆదిత్య హృదయ పారాయణం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, సూర్యనారాయణ స్వామికి మహా నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.తదుపరి సూర్యప్రభ వాహనంపై స్వామివారి శోభాయాత్ర పట్టణంలో వైభవంగా సాగింది. శోభాయాత్రలో కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు రాచూరి వెంకటేశ్వలు, కార్యదర్శి నకిరేకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, గడ్డం వెంకన్న, గండూరి రమేష్, దంతాల సందీప్, అంతటి దినేష్, షీలా శంకర్, చిత్తలూరు శ్రీధర్, కక్కిరేణి విజయ్ కుమార్, సోమ సుమన్, వెంకన్న, ఓరుగంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి