Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర

ఘనంగా రథసప్తమి శోభాయాత్ర
January 25, 2026 07:16 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రం

జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరం సీతారామచంద్రస్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ధరూరి సింగరాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు. భక్తులచే సామూహికంగా ఆదిత్య హృదయ పారాయణం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, సూర్యనారాయణ స్వామికి మహా నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.తదుపరి సూర్యప్రభ వాహనంపై స్వామివారి శోభాయాత్ర పట్టణంలో వైభవంగా సాగింది. శోభాయాత్రలో కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు రాచూరి వెంకటేశ్వలు, కార్యదర్శి నకిరేకంటి రాజశేఖర్, కోశాధికారి సోమ అశోక్, గడ్డం వెంకన్న, గండూరి రమేష్, దంతాల సందీప్, అంతటి దినేష్, షీలా శంకర్, చిత్తలూరు శ్రీధర్, కక్కిరేణి విజయ్ కుమార్, సోమ సుమన్, వెంకన్న, ఓరుగంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News