ఘనంగా జంటకవుల అష్టావధానం
ఘనంగా జంటకవుల అష్టావధానం
Prabhakar
వాగ్దేవి సంస్కృత భారతి 25 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవ వేడుకలను దీనదయాళ్ నగర్ విజయ వినాయక దేవాలయంలో వాగ్దేవి సంస్కృత భారతి వ్యవస్థాపకులు అంబికానాథ్ శర్మ సంధ్య దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో సరస్వతి దేవి అమ్మవారికి విశేష అభిషేకం ,సహస్రనామార్చనలు , అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సంస్కృతాంధ్ర అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు, అష్టావధానం ను జంట కవులైన డా ముదిగొండ అమర్నాథ్ శర్మ ముత్యంపేట గౌరీ శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు, పృచ్ఛకులుగా కవి రచయిత అక్షర కౌముది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు, గణపతి ఉపాసకులు డా నిర్మల సిద్ధరామేశ్వర శర్మ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ముదిగొండ శరభ లింగ శర్మ, సంస్కృత ఆంధ్ర భాష అభిమానులు ముత్యంపేట మల్లికార్జున శర్మ, శ్రీ శైవ మహా పీఠం మల్కాజిగిరి శాఖ అధ్యక్షులు ఎస్పీ సతీశ్ చంద్ర, హైదరాబాద పబ్లిక్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయులు కవి రచయిత ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ ఆసిటెంట్ ప్రొప్సర్ డా బి ఆర్ అంబేద్కర్ కాలేజీ సంస్కృత ఉపన్యాసకులు డా కృష్ణమూర్తి, కవయిత్రి రచయిత్రి మూర్తి శ్రీదేవి తెలుగు అధ్యాపకురాలు సరోజ కొడాలి మానస ఆర్ట్స్ థియేటర్ సంస్థ కార్యదర్శి సాహితీవేత్త రఘుశ్రీ ఉపాధ్యాయురాలు ప్రణీత,శ్రీ నిర్మల శివానంద అధ్యక్షులు జ్యోతిష్య విద్వాంసులు నిర్మల రామనాథ శర్మ సంస్కృత ఆంధ్ర పండితులు మున్నాలాల్ , శివ శ్రీ నిమ్మల నీలకంఠ శాస్త్రి గౌతమాస్ర వ్యవస్థాపక అధ్యక్షులు రాజవీరేశ్వర శాస్త్రి బ్రహ్మానందం శర్మ తదితరుల పాల్గొన్నారు, సంస్కృతాంధ్ర అష్టావధానం చేసిన జంట కవులైన అవధానులు , పృచ్ఛకులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా కవి రచయిత ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ కథ మంజీరా పిల్లల కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి