Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 AM

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం

ఘనంగా జీనియస్ పాఠశాల వార్షికోత్సవం
January 11, 2026 08:40 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మార్పులకు అనుగుణంగా మేధస్సు పెంపొందించుకోవాలి–జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ మేధస్సును పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ సూచించారు. శనివారం స్థానిక జీనియస్ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,విద్యార్థులు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకొని చెడు మార్గాలకు దూరంగా ఉండి, సన్మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేలా తమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని హితవు పలికారు.అలాగే విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి సమాజ సేవ,దేశ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని విద్యార్థులను ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముందు జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ పాఠశాల కరస్పాండెంట్ డా.బి.సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్,డైరెక్టర్లు తోట శ్రీధర్,కంటం నాగేందర్,ఎ.మణిపాల్ రెడ్డి, ఎస్.రాజిరెడ్డి,ఎన్.సత్యనారాయణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రార్థన గీతం ఆలపించారు.కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను,తల్లిదండ్రులను ఎంతగానో అలరించాయి.ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు వైద్యులు,సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మరియు వివిధ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్న వారికి పాఠశాల యాజమాన్యం జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి. స్వర్ణలత,వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్, ఏవోజి రవితో పాటు ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News