ఘనంగా అన్నా మెమోరియల్ స్కూల్ 24వ వార్షికోత్సవ వేడుకలు
ఘనంగా అన్నా మెమోరియల్ స్కూల్ 24వ వార్షికోత్సవ వేడుకలు
K.RAVI
చౌటుప్పల్ మండల కేంద్రంలోని అన్నా మెమోరియల్ స్కూల్ 24వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.వివిధ అంశాలపై రూపొందించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులు అభినందించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు జి చిన్నపరెడ్డి మాట్లాడుతూ..విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి
దోహదపడతాయని తెలిపారు.ఎంఈఓ గురువారావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంతంగి గ్రామ మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం, చిన్నపరెడ్డి సోదరుడు జి ఫాన్సీస్ రెడ్డి, వారి యొక్క అమెరికా మిత్రులు ఎలిజిబెత్, పాఠశాల ప్రిన్సిపల్స్ రాణి, సునీత, పాఠశాల అధ్యాపకులు విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి