ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి
Sthanikam District Staff Reporter
వలిగొండ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి వర్ధంతి బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిని యాదగిరి మాట్లాడుతూ భారత దేశ సామాజిక సంస్కరణల చరిత్రలో గొప్ప స్థానం సంపాదించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని ప్రతి సంవత్సరం మార్చి 10న ఆమె వర్ధంతిని దేశవ్యాప్తంగా ఘనంగా స్మరించుకుంటారని అన్నారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయగావ్ గ్రామంలో సావిత్రిబాయి పూలే జన్మించారు. ఆ కాలంలో మహిళలకు చదువు అనేది చాలా అరుదైన విషయం. కానీ ఆమె భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఆమె విద్యను అభ్యసించి సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసింది. 1848లో పూణేలో బాలికల కోసం భారతదేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించడం ఆమె గొప్ప సేవగా గుర్తింపు పొందింది. సావిత్రిబాయి పూలే కేవలం ఉపాధ్యాయురాలే కాకుండా మహిళల హక్కుల కోసం, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన మహనీయురాలు. సమాజంలో ఉన్న అంద విశ్వాసాలు కుల వివక్ష లింగ అసమానతలను వ్యతిరేకిస్తూ ఆమె ఎన్నో ఉద్యమాలు చేసింది. బాల్య వివాహాలు ప్రతి వ్యవస్థ వంటి చెడు ఆచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుడు శీలం స్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరమండ్ల యాదగిరి,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పల్లెర్ల రామచందర్, రైతు సంఘం నాయకులు యాస రంగారెడ్డి,కామ్రేడ్ కొండూరు సత్తయ్య అలియాస్ చంటి, రాపోలు పవన్ కుమార్,మస్కు నరసింహ,బీఎస్పీ జిల్లా నాయకులు పల్లెర్ల నరేష్,బీసీ నాయకులు మెరుగు వెంకటేశం, దాసరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి