Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 AM

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి
March 10, 2026 09:21 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి వర్ధంతి బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిని యాదగిరి మాట్లాడుతూ భారత దేశ సామాజిక సంస్కరణల చరిత్రలో గొప్ప స్థానం సంపాదించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని ప్రతి సంవత్సరం మార్చి 10న ఆమె వర్ధంతిని దేశవ్యాప్తంగా ఘనంగా స్మరించుకుంటారని అన్నారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నయగావ్ గ్రామంలో సావిత్రిబాయి పూలే జన్మించారు. ఆ కాలంలో మహిళలకు చదువు అనేది చాలా అరుదైన విషయం. కానీ ఆమె భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో ఆమె విద్యను అభ్యసించి సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసింది. 1848లో పూణేలో బాలికల కోసం భారతదేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించడం ఆమె గొప్ప సేవగా గుర్తింపు పొందింది. సావిత్రిబాయి పూలే కేవలం ఉపాధ్యాయురాలే కాకుండా మహిళల హక్కుల కోసం, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన మహనీయురాలు. సమాజంలో ఉన్న అంద విశ్వాసాలు కుల వివక్ష లింగ అసమానతలను వ్యతిరేకిస్తూ ఆమె ఎన్నో ఉద్యమాలు చేసింది. బాల్య వివాహాలు ప్రతి వ్యవస్థ వంటి చెడు ఆచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుడు శీలం స్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరమండ్ల యాదగిరి,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పల్లెర్ల రామచందర్, రైతు సంఘం నాయకులు యాస రంగారెడ్డి,కామ్రేడ్ కొండూరు సత్తయ్య అలియాస్ చంటి, రాపోలు పవన్ కుమార్,మస్కు నరసింహ,బీఎస్పీ జిల్లా నాయకులు పల్లెర్ల నరేష్,బీసీ నాయకులు మెరుగు వెంకటేశం, దాసరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News